ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన తలసాని

Nov 27, 2020, 1:47 PM IST

జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు శనివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలోని బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐడీసీ చైర్మన్ బాలమల్లు, పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.