రాజధానుల విషయం జగన్ అనుకున్నంత ఈజీ కాదు.. గల్లా జయదేవ్

Jun 18, 2020, 1:22 PM IST

గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమరావతి రైతులకు సపోర్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చానన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల అమరావతి ఉద్యమాలకు ఆటంకం ఏర్పడిందని అయినా సరే, తమ తమ ఇళ్లలో ఉద్యమం కొనసాగించారన్నారు. ఈ కరోనా అనేది ఓ అంటు వ్యాధి.. ఇది ఎంత కాలం ఉంటుందో తెలియదుకరోనా అదుపులోకి రావడానికి ఒక సంవత్సరం పడుతుందో, రెండేళ్లు సమయం పడుతుందో తెలియని పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పారు.