కొడుకు ఉద్యోగం పోయిందని తల్లి ఆత్మహత్యాయత్నం (వీడియో)

Oct 9, 2019, 6:55 PM IST

గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం పలుదేవర్లపాడులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

విద్యుత్ సబ్ స్టేషన్ ఉద్యోగం నుంచి తన కొడుకును  
తొలగించారనే వేదనతో సువార్తమ్మ అనే మహిళ పురుగు మందు తాగింది. సువార్తమ్మ కొడుకు రమేష్ 

గత ప్రభుత్వంలో ముప్పాళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరాడు. 

అయితే ఇటీవల వైఎస్సార్ పార్టీ నాయకులు రమేష్ ను బలవంతంగా  విధులనుంచి తొలగించి, 

ఆ స్థానంలో మరొకరిని నిమించారు. 

అధికారుల నిర్వాకంపై రమేష్ కోర్టును అశ్రయించగా,  రమేష్ ను వెంటనే విధులోకి చేర్చుకోవాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో సువార్తమ్మ మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వివరాలు రమేష్ మాటల్లోనే వినండి.