video:మూడు రాజధానులు వద్దు...ఒకటే రాజధాని ముద్దు: గుంటూరు రైతుల ఆందోళన

Dec 22, 2019, 11:03 AM IST

అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై, అందుకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీపై అమరావతి ప్రాంత ప్రజలు  మండిపడుతున్నారు. మూడు రాజధానుల  నిర్ణయాన్ని విరమించుకుని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇలా  అమరావతి కోసం భూములను కోల్పోయిన రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలా తాడికొండ మండలం మోతడక లో కూడా రైతులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.. జిఎన్ రావు కమిటీ, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజధాని అమరావతి లొనే కొనసాగాలి అని నిరసన వ్యక్తం చేశఆరు తాడికొండ మండల రైతులు, రైతు కూలీలు.