May 4, 2020, 5:04 PM IST
ఈ రోజు దివంగత దర్శకుడు, నటుడు, నిర్మాత దాసరి నారాయణ రావు 77 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఉన్న దాసరి విగ్రహాం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. కొంతమంది ప్రముఖుల మధ్య ఈ వేడుకలు జరిగాయి. దాసరి కొడుకు దాసరి అరుణ్ కుమార్, ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, కొమర వెంకటేష్, రాజేంద్ర కుమార్, బంగారు బాబు, పి డి ప్రసాద్, రామసత్యనారాయణ సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. మే 4ను డైరెక్టర్స్ డే గా ప్రకటించినట్టు తెలిపారు.