అమ్మతోడు... నాకు ఈ కేసుకు ఏ సంబంధం లేదు: బండ్ల గణేష్

Aug 31, 2021, 9:03 PM IST

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అయితే తాను పూరి జగన్నాథ్ కోసం వచ్చానని.. తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అసలు తనకెందుకు నోటీసులు ఇస్తారని బండ్ల గణేశ్ ప్రశ్నించారు. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటరాగేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఏడు గంటలకు పూరిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు.