బాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు.. దీపికా మేనేజర్‌కి ఎన్‌సీబీ సమన్లు..

Sep 22, 2020, 6:49 PM IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కీలక మలుపులు తిరుగుతోంది. ఆయన డెత్ మిస్టరీని తేల్చే క్రమంలో.. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులో బుక్ అయ్యింది. ఆమె శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు కూడా బయటపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్సీబీ అధికారులు వారికి సమన్లు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పేరు కూడా వినిపిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేసింది.