అంగరంగవైభవంగా సిరిమానోత్సవం (వీడియో)

Oct 15, 2019, 11:21 AM IST

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం తోలేళ్ల ఉత్సవం జరిగింది. ఈ రోజు జరిగే సిరిమాను ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. మంగళవారం మద్యాహ్నం మొదలయ్యే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు విజయనగరం చేరుకున్నారు. దీంతో రద్దీ బాగా పెరిగిపోయింది.