విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న (వీడియో)

Oct 11, 2019, 2:10 PM IST

కర్నూలు జిల్లా ఆలూరులో పప్పు శనగ పంటనుసాగు చేసే రైతులు విత్తనాలను పంపిణీ చేయాలని కర్నూలు బళ్లారి ప్రధాన రహదారిపై ధర్నా కు దిగారు. వ్యవసాయశాఖ సిబ్బంది రైతుల ఆందోళనను పట్టించుకోకుండా నో స్టాక్ బోర్డు పెట్టి వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయారు. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం తో రైతులఆందోళన మరింత ఉదృతం అయింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుడడంతో సాగుకు సిద్ధమౌతున్న వ్యవసాయ సిబ్బంది ఇంకా సాగుకు సమయం ఉందని విత్తనాలను వ్యవసాయ కార్యాలయంలో స్టాక్ పెట్టడంలేదని ఆవేదనవ్యక్తంచేశారు.