టీబీజీకేఎస్ నేతల ముష్టి యుద్ధం: జీఎం సన్మాన సభలో కొట్లాట (వీడియో)

Nov 25, 2019, 9:53 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీబీజీకేఎస్ కార్మిక సంఘ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జీఎం సన్మాన కార్యక్రమంలో ఇరువర్గాలు పరస్పరం దూషణలు, దాడులకు దిగాయి. ఈ క్రమంలో మల్లయ్య వర్గం నేతపై.. మిరియాల వర్గం నేతలు దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.