డబ్బుల కక్కుర్తి : ఏసీబీ వలలో గూడూరు మహిళా తహసిల్దార్

Nov 8, 2019, 1:37 PM IST

భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు కర్నూలు జిల్లా, గూడూరు తహసిల్దార్ హసీనా బి. గూడూరుకు చెందిన సురేష్ దగ్గర నాలుగు లక్షల లంచం డిమాండ్ చేయడంతో...åసురేష్ ఏసీబీని ఆశ్రయించాడు. హసీనా బి ని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు యత్నించగా, ఆమె అప్పటికే పరారైనట్లు అధికారులు తెలిపారు.