పంజాబ్ వర్సెస్ రాజస్థాన్: అభిమానులకు ఇది కదా వినోదం అంటే...

Sep 28, 2020, 1:06 AM IST

IPL 2020 ఫ్యాన్స్‌కు కావాల్సినంత క్రికెట్ మజాను అందించింది నేటి మ్యాచ్. ఆఖరి ఓవర్ వరకూ చేతుల మారుతూ, ట్విస్టుల మీద ట్విస్టులను రుచి చూపిస్తూ సాగింది రాజస్థాన్, పంజాబ్ మధ్య మ్యాచ్. 224 పరుగుల భారీ టార్గెట్. 19 పరుగులకే స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అవుట్. అయినా ఆగకుండా జోరు కొనసాగించారు స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత స్టీవ్ స్మిత్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ పంజాబ్‌కే వెళ్లిపోతుందని అనుకున్నారంతా. అయితే సంజూ శాంసన్ అద్భుతంగా పోరాడాడు. టూ డౌన్‌లో వచ్చిన రాహుల్ తేవాటియా మొదట జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. అయితే 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసిన సంజూ శాంసన్ అవుటైన తర్వాత తన గేమ్ ప్లేను మొత్తం మార్చేశాడు రాహుల్ తేవాటియా. .