హైదరాబాద్ ఫ్యాన్స్ కి షాక్: ఐపీఎల్ మిగిలిన మ్యాచులు ఆడనని చెప్పిన వార్నర్

Jun 10, 2021, 4:35 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు డేవిడ్ వార్నర్ రావడం లేదని స్పష్టం అయిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మిగిలిన మ్యాచులకు ఆస్ట్రేలియా ప్లేయర్లను పంపేందుకు ఆసీస్ క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రవర్తించిన తీరుతో డేవిడ్ భాయ్ చాలా బాధపడ్డట్టు తాజా ట్వీట్లతో స్పష్టంగా అర్థం అవుతోంది.