ఐపీఎల్ 2020 : వంద విజయాల ధోని.. సిఎస్ కె కెప్టెన్ గా మరో ఘనత..

Sep 21, 2020, 7:20 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్ లో అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ సీజన్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్ మొదటిరోజే.. చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. శనివారం జరిగిన లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై సీఎ్‌సకే నెగ్గిన విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో చెన్నైకిది వందో విజయం. దీంతో లీగ్‌ చరిత్ర లో ఈ ఫీట్‌ సాధించిన తొలి కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. 437 రోజుల తర్వాత క్రికెట్‌ మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ.. తమ తొలి మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ముందుగా బౌలర్లను, ఆ తర్వాత సమయానికి అనుకూలంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మారుస్తూ చివరకు మ్యాచ్‌ను వశం చేసుకోగలిగాడు.