వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు ... డప్పులతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

Apr 6, 2023, 2:02 PM IST

అనకాపల్లి జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎం.ఎల్.ఏ.వర్గీయులు ఉదయం చేసిన దాడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ దళిత ప్రజాప్రతినిధులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పొలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 11:30 కి ఇచ్చిన ఫిర్యాదు పై రాత్రి వరకు కేసు నమోదు చేయకపోవడంపై దళితులు డప్పులతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.