విశాఖ ఉక్కు ఉద్యమానికి వందరోజులు

May 22, 2021, 1:19 PM IST

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం నేటితో వంద రోజులకు చేరుకుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. మానవహారం ఏర్పాటుచేసి నిరసన తెలుపుతున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్టీల్ ప్లాంట్ఉద్యోగులతో పాటు వివిధ సంఘాలు తెలిపాయి.