చెట్టుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. అనుమానిస్తున్న పోలీసులు..

Aug 6, 2020, 2:24 PM IST

కృష్ణాజిల్లా నూజివీడులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పట్టణ పరిధిలోని ఎం. ఆర్. అప్పారావు కాలనీ వద్దనున్న గురుకుల పాఠశాల సమీపంలో లుంగీ, షర్టు ధరించిన ఓ 35 ఏళ్ళ వయసున్న వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. కాళ్ళు నేలను తాకుతుండడంతో అతని మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ బి. శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.