video news : ఇసుక కొరతకు మరో తాపీమేస్త్రీ బలి

Nov 2, 2019, 3:02 PM IST

తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో ఇసుక కొరత మరో తాపీ మేస్త్రిని బలి తీసుకుంది. ఇసుక కొరతతో పనులు లేక కుటుంబ ఆర్థికపరిస్థితి దిగజారడంతో భార్యభర్తల మధ్య గొడవలు అయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు అనే మేస్త్రీ  ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. భార్యా, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.