తాడేపల్లిలో దొంగతనం... రూ.2లక్షల విలువైన 11 నాటుకోళ్లు మాయం

Aug 10, 2021, 5:06 PM IST

అమరావతి: తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో విచిత్రమైన దొంగతనం జరిగింది.  గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న 11పుంజులు రాత్రికి రాత్రే మాయమయ్యాయి. దొంగతనానికి గురయినవన్నీ పందెం కోళ్లని... వీటి విలువు రూ.2లక్షల పైనే వుంటుందని విజయ్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.