కరోనాపై జగన్ జోకర్ లా మాట్లాడుతున్నాడు.. అయ్యన్నపాత్రుడు...

Apr 4, 2020, 2:16 PM IST

విశాఖజిల్లా నర్సీపట్నం, కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని  మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. నర్సీపట్నంలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధిపై ముఖ్యమంత్రిఅవగాహన రాహిత్యంతో ఒక జోకర్ లా  మాట్లాడుతున్నారన్నారు. 14 రోజులకే రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని అనడం దారుణమని, కేంద్రం దగ్గర పేదఅరుపులు అరుస్తున్నడని మండిపడ్డారు.