కృష్ణ అస్థికలతో విజయవాడకు మహేష్ బాబు... నేడు కృష్ణానదిలో నిమజ్జనం

Nov 21, 2022, 12:11 PM IST

 విజయవాడ : ఇటీవలే మృతిచెందిన సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో కలిపేందుకు ఘట్టమనేని కుటుంబం హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకున్నారు. కృష్ణ తనయుడు మహేష్ బాబు, సోదరుడు శేషగిరిరావు, అల్లుళ్లు గల్లా జయదేవ్, సుధీర్ బాబుతో  పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా విజయవాడకు చేరుకన్నారు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహేష్ బాబు అక్కడినుండి రోడ్డుమార్గంలో కృష్ణా తీరానికి బయలుదేరారు. బారీ బందోబస్తుతో దుర్గా ఘాట్ కు చేరుకున్న మహేష్ బాబు తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలపనున్నారు.