ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవం

Jul 5, 2022, 5:46 PM IST

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో  శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రతి నెల షష్టి రోజు మాదిరిగానే ఇవాళ కూడా అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు సుబ్రమణ్య స్వామి వారి కల్యాణంలో విశేషంగా పాల్గొన్నారు.