video news : 60 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని...

Nov 8, 2019, 4:02 PM IST

శ్రీశైలం నుంచి కర్నూలుకు వెళుతున్న ఇరిగేషన్ శాఖామంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్ ని శ్రీశైలం నీటి ముంపు గ్రామస్తులు అడ్డుకున్నారు. గత 60 రోజులుగా తాము రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తగిన సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.