ప్రతి ఇంటికీ రూ.25వేలు.. సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

Sep 17, 2024, 11:16 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరద బాధితులకు సాయంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇటీవల వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు. ఇళ్లు కోల్పోయినవారికి ఇళ్లు కట్టించడంతో పాటు ప్రతి ఇంటికీ రూ.25వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.