దుగ్గిరాల ఎమ్మార్వో కార్యాలయంలో సామాజిక కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Apr 26, 2022, 8:35 PM IST

గుంటూరు: దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సామాజిక కార్యకర్త  నన్నెపాగ వెంకట్రావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ట్రాఫిక్, ఇతర సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసారు. అధికారుల తీరుపై ఆవేదనతో వెంకట్రావు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఇది గమినించిన రెవెన్యూ సిబ్బంది పెట్రోల్ సీసాను లాక్కున్నారు.