రోజా రిటార్ట్ : తోచకపోతే.. వెన్నుపోటు పొడిచిన ఆస్తులుంటే తిని కూర్చోండి..

Apr 23, 2020, 4:08 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరు సుందర్యనగర్ కాలనీలో ఎమ్మెల్యే రోజాకు పూలస్వాగతం చాలా విమర్శలకు దారితీసింది. చంద్రబాబు నాయుడు దీనిమీద తీవ్రంగా విమర్శించారు. దీనికి స్పందించిన రోజా అది మేము ఊహించని ఘటన.. ప్రేమతో ప్రేమతో చల్లితే హర్ట్ చేయకూడదనుకుని ఆపలేదు. ఐదేళ్ల మీ పాలనలో వారికి నీళ్లివ్వలేదు. ఇప్పుడు మేమిచ్చాం మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు. నీ కొడుకు తిన్నది అరగక మాస్కు, గ్లౌజు లేకుండా సైకిలెక్కి తిరుగుతున్నాడు అతన్నేం చేయాలి. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా అంటూ హెచ్చరించింది.