గుంటూరులో రెచ్చిపోయిన దొంగలు ... దేవుడి హుండీనే ఎత్తుకెళ్ళిన దుండగులు

Nov 2, 2022, 3:52 PM IST

అమరావతి : మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గత అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ శివాలయంలోకి చొరబడ్డ దుండగులు భక్తులు డబ్బులువేసే హుండీనే దొంగిలించారు. నిడమర్రు శివాలయంలో ఈ దోపిడీ జరగ్గా... ఆలయ సమీపంలోని పొలాల్లో ఖాళీ హుండీని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఆలయానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.