ప్రజా వేదిక కూలదోసే ప్రక్రియ ప్రారంభం (వీడియో)

Jun 25, 2019, 8:09 PM IST

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. కూల్చేందుకు పలుగు, పారలతో కూలీలు తమ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జేసీబీలు ఇప్పటికే ప్రజావేదిక వద్దకు చేరుకున్నాయి. 

ఇప్పటికే ప్రజావేదికలోని క్యాంటీన్ ను తొలగించారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సుకోసం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు. తెల్లవారు జామున ప్రజావేదిక మెుత్తం కూల్చివేతకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు ప్రజావేదిక కూల్చివేస్తున్న నేపథ్యంలో ఫర్నీచర్ అంతటిని తరలించారు సీఆర్డీఏ అధికారులు.