అమరావతి రాజధాని అనుకూల, వ్యతిరేక ఫ్లెక్సీలతో రేపల్లెలో పొలిటికల్ హీట్

Sep 17, 2022, 11:02 AM IST

బాపట్ల జిల్లా : అమరావతి రాజధాని అనుకూల, వ్యతిరేక ఫ్లెక్సీలు బాపట్ల జిల్లా రేపల్లెలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. కొద్దిసేపట్లో రేపల్లె నియోజకవర్గం ఐలవరం గ్రామానికి ఒకే రాజధాని అమరావతి.. అంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర చేరుకుంటున్న నేపథ్యంలో వైసిపి, టిడిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మూడు రాజధానుల ద్వారానే పాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలు జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుందని పాదయాత్ర జరిగే ప్రదేశాల్లో వైసిపి శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ‘ఓకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు’ స్థానిక వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

వీటికి పోటీగా రైతుల పాదయాత్ర కు అనుకూలంగా  తెలుగుదేశం ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అమరావతి’ అంటూ అమరావతి రాజధాని అనుకూల ఫ్లెక్సీలు వెలిశాయి. ఇలా పోటాపోటీ ఫ్లెక్సీల లతో పాదయాత్ర సందర్భంగా రేపల్లె నియోజకవర్గంలో ఒక్కసారిగా ఉధృత  వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు చరయలు చేపట్టారు.