లారీ డ్రైవర్ తో 20 మందికి కరోనా.. కృష్ణలంకలో పోలీసుల గస్తీ.. హై అలర్ట్..

Apr 25, 2020, 3:53 PM IST

విజయవాడ కృష్ణ లంకలోని లారీ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ రావడం అతని ద్వారా మరో 8మందికి సోకడంతో కృష్ణలంక ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అయితే అది ఇవ్వాళ 20 చేరినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో కృష్ణలంకలో ఇళ్లలోనుండి ఎవరూ బైటికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మెడికల్ షాపులు తప్ప ఏమీ తెరిచి ఉండడానికి వీళ్లేదని ప్రచారం చేస్తూ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.