అమరావతిలో ప్లెక్సీ పాలిటిక్స్... పోలీసులే దగ్గరుండి టిడిపి ప్లెక్సీల తొలగింపు

Apr 25, 2023, 12:39 PM IST

గుంటూరు : ఇవాళ (మంగళవారం) టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు ప్లెక్సీలు ఏర్పాటుచేయడమే టిడిపి నాయకుల ప్లెక్సీలు, జెండాలను తొలగించారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రోడ్డుపక్కన, డివైడర్లపై కట్టిన టిడిపి జెండాలు, బ్యానర్లు, ప్లెక్సీలను అర్ధరాత్రి పోలీసులే దగ్గరుండి తీసివేయిస్తున్న వీడియో బయటకు వచ్చింది. వైసిపి నాయకులు చంద్రబాబు సిగ్గు సిగ్గు పేరిట పెదకూరపాడు నియోజకవర్గం గురించి ప్రశ్నలు సంధిస్తూ పెక్సీలను మాత్రం పోలీసులు తొలగించలేదు. ఈ వ్యవహారంపై టిడిపి నాయకులు సీరియస్ అవుతున్నారు.