కర్ఫ్యూ కి ప్రజలు సహకరించాలి ... నూజివీడు డిఎస్పి

May 5, 2021, 9:42 AM IST

నూజివీడు సబ్ డివిజన్ లోని ప్రజలకు జిల్లా ఎస్పి ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యల పై డిఎస్పి బి.శ్రీనివాసులు పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్ లో ఉదయం 6 గంటలనుండి 12 గంటల వరకు మాత్రమే ఆటోలు,బస్సులు,వాహనదారులు, వ్యాపారాలు జరగవచ్చని 12 గంటలు దాటిన అనంతరం అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని తెలిపారు