కాటూరు చోరీ ఘటన : రాళ్లు, పచ్చడి బండలు ఉపయోగించి దొంగతనం...

Feb 19, 2020, 10:02 AM IST

కృష్ణ జిల్లా, ఉయ్యూరు కాటూరు చోరీ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. పెద్దింటిగొల్ల ముఠాగా పిలవబడే గ్యాంగ్ ఈ డెకాయిట్ కు పాల్పడినట్లు సీపీ తెలిపారు.నిందితుల్లో నలుగురిని మీడియా ముందు సీపీ హాజరుపరిచారు.మరిన్ని దొంగతనాలకు సంబంధించి ఆధారాలను ముఠా వద్ద  పోలీసులు సేకరించారు. వారం రోజుల్లో నిందితులను అరెస్టు  చేసిన పోలీస్ టీమ్ ను సీపీ తిరుమలరావు అభినందించారు.