విద్యార్థినులతో బాత్రూంలు కడిగిస్తూ... కారంపూడి కస్తూర్భా సిబ్బంది నిర్వాకమిదీ...

Feb 13, 2023, 10:50 AM IST

కారంపూడి : పల్నాడు జిల్లా కారంపూడి కస్తూర్భా పాఠశాల విద్యార్థినులతో టీచర్లు, సిబ్బంది వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు. తమ పిల్లలతో పాఠశాల ఆవరణ, గదులు శుభ్రం చేయించడమే కాదు చివరకు బాత్రూంలు కూడా కడిగిస్తున్నారని తల్లిదండ్రలు వాపోయారు. ఇలా బాత్రూంలు కడుగుతుండగా ఆ దుర్వాసన భరించలేక ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు కూడా గురయ్యారని... ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పలేదని అన్నారు. తమతో పనులు చేయిస్తున్నారని ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెబితే ఆ విద్యార్థినులను టీచర్లు చితకబాదుతున్నట్లు తెలిపారు. ఈ నరకం నుండి తమ విద్యార్ధులను కాపాడాలంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసారు.