అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రతిపక్షాలు...

Sep 13, 2022, 2:11 PM IST

గుంటూరు జిల్లా : అమరావతి రైతుల పాదయాత్రలో బిజెపి, సిపిఐ, కాంగ్రెస్ నేతల బృందం పాల్గొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని మంగళగిరిలో రైతులకు సంఘీభావం ప్రకటించారు. రెండో రోజు రైతుల పాదయాత్ర ప్రారంభమయ్యింది. మంగళగిరి నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యింది. పాదయాత్రలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నేడు మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు పాదయాత్ర జరగనుంది. దుగ్గిరాలలో రైతులు నైట్ హాల్ట్ చేయనున్నారు. మూడోరోజు దుగ్గిరాల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.