ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు... విజయవాడలో రజనీకాంత్, బాలయ్య సందడి

Apr 28, 2023, 4:26 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. చెన్నై నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రజనీ కాంత్ కు నందమూరి బాలకృష్ణ, టిడిపి నేతలు స్వాగతం పలికారు. గన్నవరం నుండి ఒకేకారులో విజయవాడ నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు రజనీ, బాలయ్య. సాయంత్రం విజయవాడ శివారులో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి  సభలో టిడిపి చీఫ్ చంద్రబాబుతో కలిసి బాలయ్య, రజనీకాంత్ పాల్గొననున్నారు.