నలంద కిషోర్ ను వైసిపి ప్రభుత్వమే బలి తీసుకుంది.. నిమ్మకాయల చినరాజప్ప

Jul 26, 2020, 3:28 PM IST

వాట్సాప్ వ్యవహారంలో  కక్ష సాధింపు ధోరణితో ఆయన్ని ఇబ్బంది పెట్టి కరోనాతో చనిపోవడానికి  ప్రభుత్వానిదే బాధ్యత అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప  మండిపడ్డారు. ఓ పక్క కరోనా  విజృంభిస్తుంటే ప్రభుత్వం  మద్యం దుకాణాల సమయాన్ని పెంచి, ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా  వారి ప్రాణాలతో  చెలగాటం ఆడుతోందన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల పట్ల ఈ ప్రభుత్వ  అణచివేత ధోరణికి నిరసనగా  హర్ష కుమార్  చేస్తున్న పోరాటాలకు ఆయన  సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మంత్రులు చేతనే ఎదురు దాడి చేయించడం  సిగ్గుచేటన్నారు.