మాగంటి రవీంద్ర అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేష్

Jun 2, 2021, 6:58 PM IST

హైదరాబాద్: టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాధ్ మృతి చెందిన విషయం తెలిసింది. కొద్దిసేపటి క్రితమే జరిగిన ఆయన అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కేవలం ఏడాది కాలంలో ఇద్దరు కొడుకులను కోల్పోయి తీవ్ర దు:ఖంలో వున్న మాగంటి బాబును లోకేష్ ఓదార్చారు.