మంగళగిరి ఎన్నారై హాస్పటల్ లో.. కరోనా పేషంట్ల కష్టాలు..

Jul 1, 2020, 2:07 PM IST

గుంటూరు జిల్లా, మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో కోవిద్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వచ్చిందని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు తప్ప మందులు, ఆహారం ఏమీ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణ లేదని అంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్నవారిని కూడా పాజిటివ్ వారితో కలిపి ఉంచుతున్నారని దీనివల్ల వాళ్లు కరోనా ఎఫెక్ట్ అవుతుందని వాపోతున్నారు. వెంటనే దీనిమీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.