వివాహేతర సంబంధమేనా? ... కృష్ణా జిల్లాలో యువకుడి దారుణ హత్య

Sep 26, 2022, 12:06 PM IST

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామంలో బచ్చు శ్రీనివాస్(33) అనే యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండుగులు శ్రీనివాస్ ను హత్యచేసారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై వుంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.  

గ్రామస్తులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు అవనిగడ్డ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.