మహిళా ఉద్యోగులను అమ్మనా బూతులు తిట్టిన వీఆర్వో..

Apr 23, 2020, 12:52 PM IST

గుంటూరు జిల్లా కర్లపాలెంలో గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులను అసభ్య పదజాలంతో బూతులు తిట్టాడు కర్లపాలెం వీఆర్వో. దీంతో గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులు అతన్ని సస్పెండ్ చేయాలంటూ ధర్నాకు దిగారు. కీచక విఆర్వోను విధుల్లోనుండి తప్పించేవరకు మా పోరాటం ఆగదని మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో రాజకీయ అండతో రెచ్చిపోతున్నాడని అన్నారు.