ఒకే గ్రామంలో 25మంది చిన్నారులు అస్వస్థత... కారణమిదే

Aug 20, 2021, 10:52 AM IST

చిత్తూరు జిల్లా వి.కోట మండలం కుంబార్లపల్లెలో  25 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ ఆవరణలో ఆడుకుంటూ సమీపంలోని పొలాల్లోకి వెళ్లిన చిన్నారులు అడవి ఆముదం గింజలు తిన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలందరికి వాంతులు, విరేచనాలు అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు వారందనికి వి.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.