అమరావతిలో హైటెన్షన్... పొలీస్ వాహనం ధ్వంసం... టిడిపి శ్రేణులపై లాఠీచార్జ్

Apr 9, 2023, 3:00 PM IST

అమరావతి : పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని టిడిపి ఆరోపణలపై స్పందిస్తూ అమరావతిలోని అమరేశ్వరస్వామి సాక్షిగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకోసం ఆయన ఆలయానికి చేరుకోగా సవాల్ ను స్వీకరించిన టిడిపి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ భారీగా కార్యకర్తలతో కలిసి ఆలయానికి బయలుదేరారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు శ్రీధర్ ను అరెస్ట్ చేసారు.ఆయనను  పోలీస్ స్టేషన్ కు  తరలించే  సమయంలో  టీడీపీ శ్రేణులు  పోలీస్ వ్యాన్  ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో  పోలీసులు  టీడీపీ శ్రేణులపై  లాఠీచార్జీ  చేశారు.