video news : ఓంకారనాదంతో మార్మోగిన శివాలయాలు

Nov 25, 2019, 1:50 PM IST

కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.  పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి, పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి.