Oct 21, 2020, 5:17 PM IST
విజయవాడ శరన్నవరాత్రివేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. కొండ చర్యలు విరిగిపడటంతో షెడ్డు విరిగిపడి, ముగ్గురికి గాయాలయ్యాయి. శిధిలాల కింద ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. మూలా నక్షత్రం కావడంతో సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. జగన్ రాకకు కాసేపటి ముందే ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన దృష్ట్యా దర్శనం నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శిధిలాల కింద ఒక పోలీసు, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నట్లు సమాచారం.