మీది బీజేపీ కాదు..పచ్చ పువ్వులతో నిండిన టీజేపీ ...

Jun 11, 2023, 1:49 PM IST

ఏపీ ప్రభుత్వం పై నిన్న జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యల పై వైస్సార్సీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు...కర్ణాటక లో కుక్క చావు చచ్చి ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారు అని,  మర్యాదగా మాట్లాడితే మంచిది అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు...అమరావతి కేంద్రం ఇచ్చిన నిధులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తినేశారని అప్పట్లో ఆరోపణలు చేసి ఇప్పుడు అమరావతి బలపరుస్తున్నాం అనటం లో అర్థం లేదు అని వ్యాఖ్యానించారు...ఆలా అయితే అమరావతి లో జరిగిన పాపాలన్నిటికి బాద్యులు ఎవరని ప్రశ్నించారు...అలాగే ఇసుక మాఫియా గురించి నడ్డా చేసిన కామెంట్స్ పై కూడా అయన స్పందించారు..మునుపటి ప్రభుత్వం లో మీరు కూడా భాగస్వాములే అని అప్పట్లో ఇసుకను ఉచితం అని చెప్పి దోచుకున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు...రాగి పైసా లంచం కూడా లేకుండా లబ్ది దారుల ఖాతాల్లో డైరెక్ట్ గా లక్షల కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం తమదన్నారు...