చివరకు ప్లే గ్రౌండ్ కూడా అమ్ముకుంటారా..: శాప్ ఆఫీస్ వద్ద డివైఎఫ్ఐ ఆందోళన

Nov 21, 2022, 3:12 PM IST

విజయవాడ : క్రీడా మైదానాలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ డివైఎఫ్ఐ ఆందోళనకు దిగింది. ఏపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) కార్యాలయం ముట్టడికి డివైఎఫ్ఐ ప్రతినిధులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ తరలించారు. శాప్ ఛైర్మన్, ఎండీ తీసుకుంటున్న నిర్ణయాలు క్రీడాభివృద్దికి దోహదపడేలా కాకుండా క్రీడాకారులకు శాపంగా మారుతున్నాయని... వెంటనే ప్రభుత్వం స్పందించి ఎండిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.