నేడు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ

Sep 30, 2022, 11:20 AM IST

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో  వైభోవోపేతంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి వేడుకల్లో ఐదోరోజయిన ఇవాళ (శుక్రవారం) కనకదుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండే భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేసారు.