Video : ఛార్జీలభారాన్ని ప్రజలపై మోపవద్దంటూ నిరసన బాట...

Dec 9, 2019, 5:28 PM IST

ఆంధ్రప్రదేశ్ లో బస్సు ఛార్జీలు పెంచడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా మద్దిలపాలెం బస్ డిపో ముందు సిపిఐ, బీజేపీ వేరువేరుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. ఛార్జీలభారాన్ని ప్రజలపై మోపవద్దంటూ డిమాండ్ చేశాయి. నష్టనివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని సూచించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.నగర అధ్యక్షుడు నాగేంద్ర పాల్గొన్నారు.