ఏపీలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే.. తేల్చేసిన జగన్

Apr 20, 2020, 5:05 PM IST

జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని, ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని మీ అందర్నీ అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని జగన్ అన్నారు.